అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 14: అడ్డతీగలలో బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఈ .స్వప్న కుమారి పాల్గొని నివాళులర్పించారు. అలాగే అడ్డతీగల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అడ్డతీగల అనూప్ కాలేజీ లో కరస్పాండెంట్ చీకట్ల. ఆశీర్వాదం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ సేవలను కొనియాడారు.

