Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుజీకే వీధి ఎంఈఓగా ఎల్. రాంబాబుకు అదనపు బాధ్యతలు

జీకే వీధి ఎంఈఓగా ఎల్. రాంబాబుకు అదనపు బాధ్యతలు

  1. గూడెం కొత్త వీధి,పెన్‌పవర్,ఆగస్టు08:అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండల విద్యాశాఖాధికారి–Iగా ఎల్. రాంబాబుకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జోన్–1 ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎల్. రాంబాబు కొయ్యూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెడ్‌మాస్టర్ గ్రేడ్–IIగా విధులు నిర్వహిస్తున్నారు. జీకే వీధి ఎంఈఓ–Iగా పనిచేసిన యు. అప్పలనరసింహారావు జూలై 31న పదవీ విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీ నేపథ్యంలో ఈ నియామకం చేపట్టారు.డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, పాడేరు డివిజన్, జిల్లా విద్యాశాఖాధికారి సిఫార్సుల మేరకు రాంబాబుకు బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఎంఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular