అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 24:శుక్రవారం ప్రపంచ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను గుర్తించి ఇందులో భాగంగా అడ్డతీగల ఎంపీడీవో ఏ.వి.వి.కుమార్ కు రంపచోడవరం ఐటీడీఏ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చేతుల మీదగా ప్రశంసా పత్రము అందజేయడం జరిగింది. ఎంపీడీవో కుమార్ మాట్లాడుతూ తన ప్రతిభను గుర్తించిన పై అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు .

