గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 11:
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న షూస్, టై, బెల్ట్లను శుక్రవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక మండల వనరుల కేంద్రం లో పి ఎస్ యు పి ఎస్ హెచ్ ఎస్ పాఠశాలల ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. అనంతరం ఎంఈఓ వీరభద్రం మాట్లాడుతూ విద్యార్థుల్లో పాఠశాల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు, పాఠశాలల్లో క్రమశిక్షణ, ఏకరూపతనుపెంపొందించేందుకు యూనిఫాం సంబంధిత సామగ్రి పంపిణీ ఉపయోగ పడుతుందని పాఠశాలల వారీగా షూస్, టై, బెల్ట్లను సంబంధిత ఉపాధ్యాయులకు అందజేసి, విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఆర్సీ సిబ్బంది, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

