ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్గా ఆచార్య కె. వెంకట సుబ్బయ్య బాధ్యతల స్వీకరణ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 31 : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల (సీఈ) ప్రిన్సిపాల్గా మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు కె. వెంకట సుబ్బయ్య నియమితులయ్యారు. శుక్రవారం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ఆచార్య జి.పి. రాజశేఖర్ నుంచి ఆయన నియామక ఉత్తర్వులను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కె. రాంబాబు పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం పదవీ విరమణ చేసిన ఆచార్య ఎం. శశి నుంచి ఆచార్య కె. వెంకట సుబ్బయ్య ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నూతన ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య కె. వెంకట సుబ్బయ్యకు విశ్వవిద్యాలయ ఆచార్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారంతో ఆచార్య ఎం. శశి ఉద్యోగ విరమణ చేశారు.

