Homeఆంధ్రప్రదేశ్తూర్పు గోదావరిప్రాణాలు పోయేంతవరకు స్పందించరు

ప్రాణాలు పోయేంతవరకు స్పందించరు

సీతానగరం, పెన్ పవర్, మార్చి22:
వీధి కుక్కలు ప్రజలపై విచ్చలవిడిగా దాడి చేసినా అధికారులలో చలనం లేదని సీతానగరం మండల ప్రజలు మండిపడుతున్నారు. చాలా గ్రామాలలో వీధి కుక్కలు రాత్రి వేళలో కంటికి కునుకు లేకుండా అరుస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు రోగాల భారీన పడి ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు పెడుతున్నాయని అంటున్నారు. వైరస్ సోకిన కుక్కలు ప్రజలను కరిస్తే రాబిస్ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular