ePaper
Sunday, April 12, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మార్కాపురంసిమెంట్ లారీ బోల్తా...తప్పిన పెను ప్రమాదం..!

సిమెంట్ లారీ బోల్తా…తప్పిన పెను ప్రమాదం..!

పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 12

పుల్లలచెరువు మండలం మురికిమళ్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి–565పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. గిద్దలూరు వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అధిక వేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టి బోల్తా పడింది.ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు, లారీ వేగం నియంత్రణలో లేకపోవడంతో ఒక్కసారిగా డ్రైవర్ అదుపు కోల్పోయాడు. దీంతో వాహనం రోడ్డును దాటి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ, అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.సమాచారం అందుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ సహాయంతో బోల్తా పడిన లారీని రోడ్డుపక్కకు తరలించారు. దీంతో కొంతసేపు నిలిచిపోయిన వాహన రాకపోకలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి.అధికారుల ప్రాథమిక విచారణలో, వేగ నియంత్రణ పాటించకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది. రహదారులపై అధిక వేగం ప్రాణాలకు ముప్పు అని, ముఖ్యంగా భారీ వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు హెచ్చరించారు.ఈ ఘటనతో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, వేగాన్ని అదుపులో ఉంచడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular