Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుదామనపల్లిలో రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ

దామనపల్లిలో రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ

  1. గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే 25:అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. కూటమి నాయకుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సాగిన బాలరాజు రైతులకు విత్తనాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పెస కమిటీ సభ్యులు సాగిన రాధాకృష్ణ, పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షులు మాదల సతీష్, కూటమి నాయకులు పల్లం నాయుడు, బురిడీ నాగరాజు, అగ్రికల్చర్ అసిస్టెంట్ కోసూరు ఉషారాణి, సర్వేయర్ గబులంగి బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular