చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 29:
చిలకలూరిపేట : నియోజకవర్గంలోని మురికిపూడి గ్రామం నందు వేంచేసియున్న శ్రీ బోటు వీరాంజనేయస్వామి తిరునాల్లో ( 50వ వార్షికోత్సవ వేడుకల్లో ) ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిధిగా విచ్చేసి, కమిటీ వారు ఏర్పాటుచేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామి వారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ బోటు వీరాంజనేయ స్వామి వారి మీద భక్తులకు అచంచలమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయని, కూటమి పాలనలో సర్వమత సమానత్వం ఉప్పొంగుతుందని, అన్ని మతాల ప్రజలు సంతోషంగా తమ ఆచారా వ్యవహారాలు, పండుగలు జరుపుకుంటున్నారని ప్రత్తిపాటి అన్నారు.

