అడ్డతీగల, పెన్ పవర్, ఏప్రియల్ 13:ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ను మండలం లోని అన్ని పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయంలలో ఘనంగా నిర్వహించాలి అని ఎంపీడీవో కుమార్ తెలిపారు. పంచాయతీ అభివృద్ధి అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ లో ఈ కార్యక్రమాలు జరగాలని అడ్డతీగల ఎంపీడీవో ,పంచాయతీ ప్రత్యేక అధికారి కుమార్ తెలిపారు. సచివాలయం సిబ్బంది అందరూ తప్పనిసరిగా హాజరై బాబా సాహెబ్ అంబేద్కర్ కు నివాళలు అర్పించాలని, తమ కార్యాలయ సిబ్బందికి ,పంచాయతీ సిబ్బందికి ఎంపీడీవో కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

