✒️
విశాఖలో 234 ఏ బ్లాక్ వార్డు రక్షణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 30 : విశాఖపట్నం శాంతిపురం పరిధిలోని పోర్టు రక్షణ సంస్థలో 234 ఏ బ్లాక్ వార్డు రక్షణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలక చర్యలు చేపట్టారు. ఈ మేరకు గార్డు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ యం. విశ్వేశ్వర నాయుడు వార్డు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వార్డులోని శిక్షణ పొందిన 48 మంది వాలంటీర్లు, 234 ఏ బ్లాక్కు చెందిన కార్యకర్తలతో సమావేశమై ప్రజలకు అందుబాటులో ఉండే అత్యవసర సేవలు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. అలాగే పోర్టు వైర్లెస్ నెట్వర్క్ను సమర్థవంతంగా వినియోగించుకునే అంశాలపై సూచనలు చేశారు.
పోర్టు రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు స్థానిక ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన వాలంటీర్లకు విపత్తుల సమయంలో స్పందించే విధానం, రక్షణ చర్యలు, సమాచార వ్యవస్థల వినియోగంపై ప్రాయోగిక శిక్షణ అందించారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి యం. విశ్వేశ్వర నాయుడు, శ్రీ కమలపాటి సుధాకర్, పోర్టు రక్షణ అధికారి ప్రతినిధులు, ఎన్డీఆర్ఎఫ్, యూఎన్డీపీ–జీఓఐ ప్రాజెక్టు ప్రతినిధులు, వార్డు సిబ్బంది, డీఆర్డీఏ, వైద్య, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.

