అమరావతి పెన్ పవర్
*ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 18 వరకు పొడిగించిన ప్రభుత్వం.*
*అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకే మరో రెండు రోజులు గడువు పెంచినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.*
*గతంలో సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు ఉన్న గడువును 18వ తేదీ వరకు పొడిగింపు.*
*వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి.*
*స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు ఈ-కేవైసీకి పూర్తి ఏర్పాట్లు.*
*ఆన్లైన్లో దరఖాస్తు నమోదు అనంతరం అక్నాలెడ్జ్మెంట్ పత్రం అందజేత.*
*రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా ద్వారా 62 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నాము.*
*అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ గడువు పొడిగింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.*

