గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం , జూలై 29 : గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్ సమీపంలోని కొండపై వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామివారిని బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు దేవస్థాన అర్చకులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్న హోంమంత్రి అనితకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులతో హోంమంత్రి అనిత ఆప్యాయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ సత్యనారాయణ స్వామివారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.

