గూడెం కొత్తవీధి, పెన్ పవర్, ఆగస్టు 11: కుక్క దాడిలో గాయపడిన గూడెం కొత్తవీధి మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి వంతల చంటిబాబును దామనాపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్, వైసీపీ సీనియర్ నాయకుడు కుందేరి రామకృష్ణ సోమవారం రాత్రి పరామర్శించారు. చంటిబాబుపై కుక్క దాడి చేసి గాయపరిచిన విషయం తెలుసుకున్న రామకృష్ణ ఆయన స్వగ్రామానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.చంటిబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రామకృష్ణ.. వైద్యుల సూచనల మేరకు మందులు క్రమం తప్పకుండా వాడుతూ, తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా చంటిబాబు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ అరకు యిర్మీయా, సాగిన సత్తిబాబు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
గాయపడిన వైసీపీ నేత వి.చంటిబాబును పరామర్శించిన కుందేరి రామకృష్ణ
RELATED ARTICLES

