Homeతెలంగాణహమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 13:

ఆల్ హమాలీ కార్మికులకు వెల్పేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని,ఆల్ హామాలీ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి,వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆల్ హమాలి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆల్ హమాలీ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల మ్యానిఫెస్టోలో హమాలీలకు వెల్పేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని, వారికి సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ శారదకు అందించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హామాలి యూనియన్ రాష్ట్ర నాయకులు అంబటి వీరస్వామి, హమాలి సంఘం నాయకులు యు. మల్లయ్య,డి. ప్రవీణ్, సర్వర్, ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular