దగా డీఎస్సీకి నిరసనగా వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగష్టు 6
కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా డీఎస్సీని “దగా డీఎస్సీ”గా అభివర్ణిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఇసుకతోటలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ నిరాహార దీక్షలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలు పేడాడ రమణికుమారి పాల్గొని ప్రభుత్వ విధానాలను విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, మహిళా విభాగ ప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

