ePaper
Sunday, April 5, 2026
ePaper
Homeఎడిటోరియల్కోనలోవ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం ఎమ్మెల్యే శిరీష దేవి..

కోనలోవ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం ఎమ్మెల్యే శిరీష దేవి..

కోనలోవ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం ఎమ్మెల్యే శిరీష దేవి..

అడ్డతీగల ,పెన్ పవర్, ఏప్రియల్ 05: అడ్డతీగల మండలం కోన లోవ గ్రామంలో ఆదివారం ఉదయం నాలుగు ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలి బూడిద అయ్యాయి. విషయం తెలుసుకున్న రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల .శిరీష దేవి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, బాధితులను పరామర్శించి, ఎవరు అధైర్య పడవద్దని అన్ని విధాల ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం తక్షణసాయంగా బాధితులకు బియ్యం వంట సామాగ్రి అందజేశారు. నష్టాన్ని అంచనా వేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ,కార్యకర్తలు గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల వారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular