చింతపల్లి,పెన్ పవర్,ఆగస్టు 15: చింతపల్లి ప్రభుత్వ ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి మూడో విడత దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వై. రామ్మోహనరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.అర్హత కలిగి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 19వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అదే రోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఐటీఐ కళాశాలలో హాజరు కావాలని తెలిపారు.సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు 20వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు.మరిన్ని వివరాల కోసం 94949 29104, 94943 77833 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
చింతపల్లి ఐటీఐలో మూడో విడత దరఖాస్తులకు ఆహ్వానం
RELATED ARTICLES

