గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 3: వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేయదలచిన నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో పోలీసు అనుమతి పొందాలని గూడెంకొత్తవీధి ఎస్సై సురేష్ సూచించారు. అనుమతి కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. నిర్వాహకులు సంబంధిత పోర్టల్లో వివరాలు నమోదు చేసి ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆన్లైన్ దరఖాస్తు కోసం:
(https://ganeshutsav.net/?utm_source=chatgpt.com)

