గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15: ఇంటర్మీడియట్ ఫలితాల్లో గూడెం కొత్తవీధి కేజీబీవీ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబర్చారు. ప్రథమ సంవత్సరంలో 95%, ద్వితీయ సంవత్సరంలో 97% ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో సాగిన సింధుతులాని 871 మార్కులతో, ప్రథమ సంవత్సరంలో కె. సుబ్బలక్ష్మి 446 మార్కులతో టాపర్లుగా నిలిచారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, బోధన సిబ్బంది అభినందించారు.
జీకే వీధి కేజీబీవీకి ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ
RELATED ARTICLES

