గార్ల, పెన్ పవర్, జులై 26:
సమాజంలో మార్పు రావాలంటే ప్రజా చైతన్య కళల ద్వారానే సాధ్యమని ప్రజానాట్యమండలి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు అలవాల రామకృష్ణ అన్నారు. మహబూబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో ఈనెల 28 29 30 తేదీల్లో ప్రజానాట్యమండలి రాష్ట్రస్థాయి పాటల శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రజానాట్య మండలి శిక్షణా తరగతులు కళాకారులలో సామాజిక స్పృహను పెంపొందించడానికి, జానపద ప్రదర్శన కళలను ఉత్తేజితం చేయడానికి ఎంతగానోఉపయోగపడతాయని ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పాటల శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని ఆయన కోరారు.

