అడ్డతీగల, పెన్ పవర్, మే 23: భక్రీద్ పండుగ సందర్భంగా పై అధికారు ల సూచనల మేరకు అడ్డతీగల సర్కిల్ పరిధిలో అక్రమ పశువుల రవాణా, జంతువులపై క్రూరత్వం మరియు చట్ట విరుద్ధ కార్యకలాపాల నియంత్రణకు అడ్డతీగల సర్కిల్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. హైకోర్టు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తూ చెక్ పోస్టులు, ప్రధాన రహదారుల మరియు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. గజేంద్ర కుమార్ తెలిపారు.
పశువుల రవాణా సమయంలో సంబంధిత చట్టాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ పశువుల రవాణా, జంతువులపై క్రూరత్వం లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ ఎం. గజేంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు.

