గార్ల, పెన్ పవర్, ఆగస్టు 3:
గార్ల మండల కేంద్ర సమీపంలోని రజాలి బేగ్ దర్గా వద్ద గంధం, దీపారాధన ఉర్సు ఉత్సవాలు ఈనెల 5 6 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నామని దర్గా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ రహీంఖాన్ మహమ్మద్ షబ్బీర్ ఖాన్ సోమవారం తెలిపారు. మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా భక్తులు జిల్లా నుంచే గాక వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలిరానున్నారని అనారోగ్యంతో బాధపడేవారు దర్గాలో మూడు రోజులు నిద్ర చేస్తే నయం అవుతాయనేది భక్తుల నమ్మకం. అన్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని, చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్గా ప్రత్యేక ఆశీస్సులు పొందాలన్నారు.

