Homeఆంధ్రప్రదేశ్కాకినాడజగన్నాథగిరిలో రఘురామా రైస్ మిల్ తనిఖీ

జగన్నాథగిరిలో రఘురామా రైస్ మిల్ తనిఖీ

బియ్యం నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిన పౌర సరఫరా సంస్థ చైర్మన్ తోట సుధీర్
కాజులూరు , పెన్ పవర్, ఏప్రిల్ 25:
రాష్ట్ర పౌర సరఫరా సంస్థ చైర్మన్ తోట సుధీర్ శనివారం కాజులూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని జగన్నాథగిరి గ్రామంలో ఉన్న రఘురామా రైస్ మిల్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
నాణ్యత తనిఖీకి శాంపిల్స్ సేకరణ
మిల్‌లో నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను నిర్ధారించేందుకు నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని పేర్కొన్నారు.
రికార్డుల పరిశీలన
ఈ సందర్భంగా రైస్ మిల్ నిర్వహణకు సంబంధించిన రికార్డులను అధికారులు సమగ్రంగా పరిశీలించారు. సరఫరా వ్యవస్థలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ పర్యటనలో సివిల్ సప్లై ఏఎస్ఓ లక్ష్మీ ప్రసన్న, ఎంఎస్‌వోలు జేఎంఎం కృష్ణ, టి. శ్రీనివాస్, వీఆర్వో ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular