ముస్లింల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం
the-welfare-of-muslims-is-possible-with-the-telugu-desam
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు
హజ్ యాత్రికుల వ్యాక్సినేషన్ కార్యక్రమం
ఒంగోలు దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న షాదీ ఖానాలో సోమవారం హజ్ యాత్రికుల కోసం నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.
చంద్రబాబు హయాంలోనే ముస్లింలకు ప్రగతి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ముస్లింల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలయ్యాయన్నారు. షాదీఖానాల నిర్మాణం, మసీదు మరమ్మతులు, ముస్లిం కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధి, ఇమామ్ మౌజన్లకు జీతాలు వంటి పథకాలతో ముస్లింల సంక్షేమం కొనసాగిందన్నారు.
ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించండి – ఎంపీ మాగుంట
హజ్ యాత్రికులు రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించాలని ఎంపీ మాగుంట కోరారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి సమగ్ర అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు.
ప్రకాశం జిల్లాలో నుంచి 45 మంది హజ్ యాత్రికులు
ఈ సంవత్సరం ప్రకాశం జిల్లాకు చెందిన 45 మంది హజ్ యాత్రకు వెళ్తున్నట్టు షేక్ హుస్సేన్ తెలిపారు. యాత్రికుల ఆరోగ్య పరిరక్షణ కోసం వ్యాక్సినేషన్, వైద్య సహాయం అందించేందుకు జిల్లా ఆరోగ్యశాఖ, హజ్ కమిటీ అధికారులు సన్నద్ధమయ్యారు.
పాల్గొన్న ప్రముఖులు, మత పెద్దలు
కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ కఫిల్ బాషా, పఠాన్ హనీఫ్ ఖాన్, షేక్ అజీమున్నీసా, షేక్ ఆరిఫా, షేక్ అమృల్లా తదితరులు పాల్గొన్నారు. మత పెద్దలుగా షేక్ సాదిక్, మౌలానా అబ్దుల్ రెహమాన్, ముఫ్తి అసద్ తదితరులు హాజరయ్యారు.